తెలంగాణా కంటే సీమంధ్ర వెనుకబడి ఉంది , సర్వే సంచలన వ్యాఖ్య లు


తెలంగాణా ఇచ్చే సమయం ఇది కాదని మల్కాజ్గిరి ఎం.పీ , కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. నిజంగా చూస్తే తెలంగాణా కంటే సీమంధ్ర వెనుకబడి ఉందన్న సర్వే, ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం ఇస్తే తెరాస లాభపడుతుందని, కాబట్టి కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా అనుకూలంగా ఉన్నప్పుడే ప్రత్యేక రాష్ట్రం ఇస్తుందన్నారు. అలాగే జగన్ పార్టీ గురించి మాట్లాడుతూ లక్ష్మిపార్వతి కి పట్టిన గతే జగన షర్మిల లకు పడుతుందని ఎద్దేవా చేసారు. తెలంగాణా ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ఎం.పీ ఇలా వ్యాఖ్యానించడం అందునా అఖిల పక్ష సమావేశానికి 4 రోజుల ముందు సంచలనం సృష్టిస్తోంది. హై కమాండ్ కు విధేయుడిగా ఉంటూ మంత్రి పదవి దక్కించుకున్న సర్వే ఇలా అధిష్టానాన్ని ఇబ్బంది పెట్టకుండా మాట్లాడడం సహజమేనని కొందరు అంటున్నా, తెలంగాణావాదులు మాత్రం భగ్గుమంటున్నారు. 

0 comments:

Post a Comment

 
Top