రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా నాయక్. వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం ఓ ప్రత్యేక గీతాన్ని రామ్ చరణ్-చార్మిలపై హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ పాట చిత్రీకరణ జరుగుతుండగా మెగాస్టార్ చిరంజీవి అక్కడికి వచ్చారు. ఆయన రాకతో అక్కడి వాతావరణం ఒక్క సారిగా సందడిగా మారిపోయింది. ‘నెల్లూరే...’ ఐటెం సాంగ్ చిత్రీకరణ సమయంలో ఆయన రాక చార్మి సహా యూనిట్ సభ్యులల్లో ఉత్సాహం నింపింది. ఈ విషయాన్ని చార్మి ట్విట్టర్ లో పొస్ట్ చేసింది. చిరంజీవి రాక అందరిలో కొత్త ఉత్సాహం నింపిందని, రామ్ చరణ్ తో చేసిన ఈ పాట తనకి మంచి పేరు తీసుకుని వస్తుందని భావిస్తున్నట్లు తెలిపింది.  నాయక్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల కానుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్-అమలాపాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

0 comments:

Post a Comment

 
Top