ఒకప్పుడు తన అందాలతో సినిమా ఇండస్ర్టీని ఏలిన పదహారేళ్ల శ్రీదేవి.. ఇప్పుడు ఫిప్టీలోకి అడుగుపెడుతోంది. హాఫ్ సెంచరీ కొట్టిన శ్రీదేవి అందం ఇప్పటికీ అభిమాలను ఆకర్షిస్తూనే వుంది. చాలాకాలం తర్వాత 'ఇంగ్లీష్-వింగ్లీష్' అంటూ రీ-ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి ఇప్పుడు ఇండస్ర్టీలో సందడి సందడి చేస్తోంది. పలు సినీ ఫంక్షన్లలో కూడా జోరుగా పాల్గొంటోంది. ఇంత వరకు బాగానే వుంది కానీ, శ్రీదేవి వ్యవహారమే అందరిని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. శ్రీదేవి ఏదైనా ఫంక్షన్లకు వెళితే మాత్రం కుర్ర హీరోయిన్లలా మినీ స్కర్టులు, స్లీవ్ లెస్ డ్రెస్సులు వేసుకొని వచ్చి అందరిని ఇట్టే ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు ఆ ఫంక్షన్లకు తన హైటు పెరిగిన కూతుళ్లను కూడా వెంటబెట్టుకొని వస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది. ఈ ముగ్గురు కూడా మోకాళ్ళ పైకి ఉండే డ్రెస్సులు వేసుకొని వచ్చి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. సినీ ప్రపంచంలో అమ్మాయిలు ఎంత వరకు సేఫ్ గా ఉంటారో ఎంతో అనుభవం ఉన్న శ్రీదేవికి తెలుసు. అలాంటి శ్రీదేవి తను ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటూ కూతుళ్లను కూడా అలాగే ప్రొత్సహించడం అందర్ని ఆశ్చర్యపరుస్తోంది. తన కూతురు జాహ్నవి ఇప్పుడే సినిమాల్లోకి రాదు...  ఆమెకింక పద్నాలుగేళ్లే అంటూ ఇటీవలే శ్రీదేవి ప్రకటించింది. అంటే తనలాగే పదిహేనేళ్ల తర్వాత కూతురుని సినిమాల్లోకి తీసుకువచ్చే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు సినీజనాలు. 'పదహారేళ్ల వయసు' సినిమా సమయంలో...  అప్పటి పత్రికలు 'పదిహేనేళ్ల ప్రాయంలో ''పదహారేళ్ల ప్రాయా''న్ని చవిచూసిన శ్రీదేవి' అంటూ డబుల్ మీనింగ్ తో హెడ్ లైన్స్ పెట్టాయి. ఆ అనుభవం ఉన్న శ్రీదేవి తన కూతురును కూడా వచ్చే ఏడాది (అంటే జాహ్నవికి 15ఏళ్ల వయసు వస్తుంది కాబట్టి అప్పుడే) సినిమాల్లోకి తీసుకువస్తుందా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్..!

0 comments:

Post a Comment

 
Top