భద్రాచలంలో భద్రాచలరామయ్యను దర్శనం చేసుకోవడానికి వెళ్తున్న భక్త బృందం రోడ్డుప్రమాదానికి గురైంది. ప్రమాదంలో 10మంది మృతిచెందారు. కాగా అయ్యప్పస్వామిని దర్శించుకోవడం వెళ్తు శబరిమలై వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాంలో ఒక భక్తుడు చనిపోయారు. ఖమ్మంజిల్లా కొత్తగూడెం- ఇల్లందు క్రాసింగ్ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో టాటాఏస్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ వేగంగా డీకొట్టడంతో టాటా ఏస్ వాహనంలో ప్రయాణిస్తున్న 10మంది అక్కడి కక్కడే మృతిచెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా కొత్తగూడెం క్రాసింగ్ వద్ద చనిపోయిన వారంత వరంగల్ జిల్లా నర్సంపేటమండలం శేఖర్ పల్లి గ్రామానికి చెందిన వారు. వీరంత ముక్కోటీ ఏకదశీ సందర్బంగా భద్రాచలం వెళ్లుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా కేరళరాష్ట్రంలోని శబరిమలై సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అయ్యప్ప స్వామి దర్శనంకోసం వెళ్లినటువంటి ఆంధ్రప్రదేశ్ కు చెందిన భక్తుడు అనిల్ కుమార్ మృతి చెందారు. దీంతో పాటు నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు.

0 comments:

Post a Comment

 
Top