విశాఖపట్నం: మాజీ మావోయిస్టు గంటి ప్రసాదం ఆదివారం ఉదయం అనూహ్యంగా అదృశ్యమయ్యాడు. గంటి ప్రసాదం విజయవాడనుండి వైజాగ్ జన్మభూమి ఎక్సుప్రెస్ లో వెళుతుండగా అదృశ్యమయ్యాడు. కొన్నాళ్ళు మావోయిస్టులో పని చేసిన గంటి ఆ తర్వాత జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. ఆయన మావోయిస్టు నాయకుడు రామకృష్ణ(ఆర్కె)కు సన్నిహితుడు. ఇప్పుడు ఆంధ్ర-ఒరిస్సా బార్డర్లో(ఏవోబి)లో ఆర్కె కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మాజీ నక్సలైట్ గంటి అదృశ్యం కావటంకో ప్రజా సంఘాలు ఆందోళన వెలిబుచ్చుతున్నాయి. పోలీసులే అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు. ఎపిసిఎల్సీ నాయకుడు క్రాంతి ఇది పోలీసుల అరెస్టేనని అంటున్నారు. గంటి ప్రసాదాంను పోలీసులు వెంటనే కోర్టులో ప్రవేశ పెట్టాలని విరసం నేత చలసాని ప్రసాద్ డిమాండ్ చేశాడు. కాగా గంటి ప్రసాదం అమరవీరుల కుటుంబాల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.

0 comments:

Post a Comment

 
Top