నాగపూర్: భారత్ తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 193 పరుగులకు ఆలౌటయింది. మెకల్లమ్ అవుటయిన తర్వాత సౌథీ మూడు సిక్సులతో మొదట విజృంభించినప్పటికీ 38 పరుగులకు అవుటయ్యాడు. ఆట ప్రారంభంకాగానే వెంటవెంటనే న్యూజీలాండు బ్యాట్సుమెన్ అవుటయ్యారు. దీంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. 148/7 స్కోరుతో ఆదివారం రెండో రోజు ఆట ఆరంభించిన కివీస్ వేగంగా వికెట్లు కోల్పోయింది.

మరో 45 పరుగులు జత చే సి మిగతా వికెట్లు కోల్పోయింది. మెకింతోస్ 4, గుప్తిల్ 6, టేలర్ 20, రైడర్ 59, వెటోరి 3, హప్కిన్స్ 7, మెక్ కల్లమ్ 40, మెకే 5, సౌతీ 38 పరుగులు చేసి అవుటయ్యారు. విలియమ్‌సన్ డకౌట్ అయ్యాడు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టాడు. ఒజా 3, శ్రీశాంత్ 2 వికెట్లు తీశారు. హర్భజన్‌కు ఒక వికెట్ దక్కింది

0 comments:

Post a Comment

 
Top