‘మగధీర’ లో నటించిన గుర్రం ‘బాషా’ ఇప్పుడో సెలబ్రిటీ. గుర్రపు స్వారీ వచ్చిన సినీ కుటుంబాల్లోని వారంతా ఒక్కసారయినా బాషాని ఎక్కి స్వారీ చేయాలని సరదా పడుతున్నారు. అలానే మోహన్ బాబు కూతురు కూడా బాషాపై ఎక్కి స్వారీ చేసింది. ఆ గుర్రంపై స్వారీ చాలా బాగుందనీ, ఆ గుర్రం చాలా వేగంగా పరిగెడతుందని, లక్ష్మీప్రసన్న మెచ్చుకుంది. ఈ గుర్రమెంతో స్పీడని చెబుతోందంటే లక్ష్మీ ప్రసన్నకి గుర్రాలతో పరిచయం ఎక్కువేననుకోవాలి.

ఇదిలావుంటే లక్ష్మీప్రసన్న విలన్ గా నటించిన ‘అనగనగా ఒక ధీరుడు’ చిత్రం షూటింగ్ పూర్తయింది. సిద్దార్థ హీరోగా ప్రకాశరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలోని పాత్ర కోసం చాలా కష్టపడ్డానని, ఎన్నో గంటలు కష్టపడి మేకప్ వేసుకున్నానని, చాలా దెబ్బలు కూడా తగిలించుకున్నానని మంచు లక్ష్మీ చెప్పు కొచ్చింది. ఈ సినిమా తర్వాత తనకు నటిగా అవకాశాలు పెరుగుతాయని ఆమె అంటోంది. ఝుమ్మంది నాదం సినిమా తర్వాత మరో చిత్రాన్ని నిర్మించకుండా లక్ష్మీ మళ్లీ టాక్ షోలు చేసుకుంటోంది.

0 comments:

Post a Comment

 
Top