వివాదాల్లో చిక్కుకోవడం ఇప్పుడు హీరోయిన్లకు సాధారణ విషయంగా మారింది. ఇప్పుడు ఈ కోవలోకి బాలీవుడ్ హీరోయిన్ ఇషాడియోల్ చేరింది. ప్రముఖ నటి హేమామాలిని కుమార్తె అయిన ఇషా గతంలోనే తన వీపునకు కుడివైపున గాయత్రీ మంత్రాన్ని టటూ వేయించుకుంది. సంస్కృతంలో ఉన్న ఈ టాటూతో ఫోటోలకు ఫోజులివ్వడం అప్పట్లోనే వివాదాస్పదమైంది. కాగా, ఇషా బుధవారం నాడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకుంది. టటూ కనిపించే విధంగా ఇషా వస్ర్తధారణ చేసుకుంది. దీంతో ఈ టాటూ మళ్లీ వెలుగులోకి వచ్చింది. పరమ పవిత్రమైన గాయత్రీ మంత్రాన్ని పాశ్చాత్య ధోరణికి నిదర్శనమైన టాటూ రూపంలో ముద్రించుకోవడం దారుణమని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఇషా మాత్రం ఈ విమర్శలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. తన శరీరంపై గాయత్రీ మంత్రాన్ని టాటూ వేయించుకుంటే నష్టమేంటని ప్రశ్నిస్తోంది. ఇది తన వ్యక్తిగత విషయమని, గాయత్రీ మంత్రమంటే తనకు ఇష్టమని, అది ఏ ఒక్కరి సొత్తు కాదని కాస్త ఘాటుగానే సమాధానిమిస్తుంది.

0 comments:

Post a Comment

 
Top