హైదరాబాద్: యువనేత వైఎస్ జగన్మోహన రెడ్డికి మద్దతుగా రాష్ట్రమంతటా కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పరంపర కొనసాగుతోంది. జగన్ రాజీనామాతో రాష్ట్రం ఒక్కసారిగా భగ్గుమంది. జగన్'కు మద్దతుగా అన్ని జిల్లాలలో ప్రదర్శనలు నిర్వహించారు. కడప, అనంతపురం, తిరుపతి, విజయవాడలలో ఆందోళనలు ఉధృతంగా జరుగుతున్నాయి. పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారు. పిసిసిలో కొందరు, రాష్ట్రంలోని పలు డిసిసిల అధ్యక్షులు, కార్యదర్శులు, మహిళా నేతలు రాజీనామాలు చేశారు. యువజన కాంగ్రెస్ నేతలు కూడా పలువురు రాజీనామా చేశారు. పార్టీ అనుబంధ సెల్'ల నేతలు కూడా అనేకమంది రాజీనామాలు చేశారు. వీరే కాకుండా పలువురు ఎంపిపిలు, ఎంపిటిసిలు, సర్పంచ్'లు రాజీనామాలు చేశారు.

0 comments:

Post a Comment

 
Top