‘అహ నా పెళ్ళంట’ ఈ పదం వింటే చాలు... తెలుగువారికి ‘జంధ్యా’మారుతం తాకిన ఫీలింగ్. సరిగ్గా 23 ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా చేసిన అల్లరి అలాంటిది మరి. మళ్లీ ఆ పేరుతో సినిమా తీయడమంటే... దానికి కొండంత ధైర్యం కావాలి. అది తనకు మెండుగా ఉంది అంటున్నారు నిర్మాత సుంకర రామబ్రహ్మం.

ఆ ధైర్యంతోనే ఆయన అల్లరి నరేష్ కథానాయకుడిగా ‘అహ నా పెళ్లంట’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీరభద్రం ఈ చిత్రానికి దర్శకుడు. శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోన్న ఈ సినిమా గురించి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గరికపాటి కిషోర్ మాట్లాడుతూ -‘‘ఈ టైటిల్ ప్రతిష్టను పెంచే సినిమా ఇది. ఈ టైటిల్ పెట్టే ధైర్యం మాకు రావడానికి కారణం ఈ కథే.


రెండున్నర గంటల పాటు ప్రేక్షకుల్ని నవ్వుల లోకంలో విహరపింపజేసే సినిమా ఇది. అల్లరి నరేష్ కెరీర్‌లో మైలురాయిలా నిలిచిపోయే సినిమా ఇది. ఈ నెల 28న బ్యాంకాక్‌లో షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్‌లో నరేష్, కథానాయిక రీతూ బర్మేచాపై రాజు సుందరం నృత్య దర్శకత్వంలో ఓ పాట, అలాగే నరేష్, బ్రహ్మానందంపై మరో పాట చిత్రీకరిస్తాం. దీంతో రెండు పాటలు మినహా దాదాపు షూటింగ్ పూర్తవుతుంది’’ అని తెలిపారు.

0 comments:

Post a Comment

 
Top