గతంలో మహేష్ బాబు పోకిరి సినిమాలో క్రిష్ణమనోహర్ ఐపీఎస్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో మహేష్ బాబు టాలీవుడ్లో నెంబర్ వన్ హీరో స్థానంలోకి చేరాడు. ఆ తర్వాత మళ్ళీ దూకుడు సినిమాలో పోలీస్ పాత్రలో చేశాడు. ఆ సినిమా హిట్ కొట్టాడు. దాంతో టాలీవుడ్లో మహేష్ పోలీస్ పాత్రలో నటిస్తే ఆ సినిమా హిట్ అనే ఓ సెంటిమెంట్ అయిపొయింది. దాంతో ప్రస్తుతం దర్శకులంతా ప్రిన్స్ కి పోలీస్ కథలు తయారు చేస్తున్నారు. ఆ జాభితాలో దర్శకుడు గౌతం మీనన్ ముందు వరుసలో ఉన్నాడు. ఇక గౌతం మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఘర్షణ ఏమాయ చేసావే వంటి హిట్ సినిమాలు ఉన్నాయి. పోలీస్ కథలను రూపొందించడంలో అతను స్పెషలిస్ట్ కూడా. ప్రస్తుతం సూర్యతో ఓ సినిమా తెరకెక్కిస్తున్న గౌతమ్ మీనన్ మహేష్ బాబుకి ఓ యదార్ధ పోలీస్ కథ చెప్పాడట. మహేష్ బాబు కూడా కథ వినగానే నటించేందుకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో '1 - నేనొక్కడినే' శ్రీనువైట్ల 'ఆగడు' చిత్రాలు రూపొందించిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని ఫిల్మ్ నగర్ సమాచారం.

0 comments:

Post a Comment

 
Top