పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘తుఫాన్' ఆడియో వేడుకకు చీఫ్ గెస్ట్‌గా హాజరవుతారని అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే పవన్ స్టార్‌ మాత్రమే కాదు మెగా స్టార్ చిరంజీవి కూడా రాక పోవడంతో అభిమానులు కాస్త అప్ సెట్ అయ్యారనే చెప్పాలి. ఎవరూ ఊహించని విధంగా ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. కాగా...‘తుఫాన్' ఆడియో వేడుక వేదికపై రామ్ చరణ్ తేజ్ తన ప్రసంగం కొనసాగిస్తూ మధ్యలో తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రస్తావన రాగానే అభిమానులంతా ఈలలు, విజిల్స్ వేస్తూ సందడి చేయడం మొదలు పెట్టారు. ఆ హడావుడి తగ్గే వరకు పవన్ తన ప్రసంగానికి బ్రేక్ ఇవ్వక తప్పలేదు.
                                          
                                  పవన్ కళ్యాణ్ పేరు రాగానే అభిమానుల రెస్పాన్స్ చూసిన అథితులు, ముఖ్యంగా ముంబై నుంచి వచ్చిన వారు ఆశ్చర్యానికి గురయ్యారు. కాగా....పవన్ కళ్యాణ్ ఆడియో వేడుకకు ఎందుకు హాజరు కాలేదో ఇకా స్పష్టం కాలేదు. కావాలనే పవన్ ఈ ఆడియో వేడుకకు దూరంగా ఉన్నట్లు సమాచారం. తుఫాన్ సినిమా వివరాల్లోకి వెళితే....రామ్ చరణ్ బాలీవుడ్లో నటించిన తొలి మూవీ ‘జంజీర్' చిత్రాన్ని తెలుగులో ‘తుఫాన్' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈచిత్రాన్నికి అపూర్వ లఖియా దర్శకత్వం వహించారు. తెలుగులో యోగి ఆద్వర్యంలో చిత్రీకరణ జరిగింది. రియలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ ఈచిత్రాన్ని భారీ బాడ్జెట్‌తో తెక్కించింది.


0 comments:

Post a Comment

 
Top